13/11/2016
మనదేశంలో మంచికంటే చెడే ఎక్కువగా త్వరగా వ్యాపిస్తుంది. కొన్ని వూర్లలో సినిమాకంటే పైరసీ వీడియోనే ముందుగాచ్గేరుతుంది. పనికొచ్చే విషయం పక్కవాడితో పంచుకుంటే వాడేక్కడ బాగుపడిపోతాడోననీ
తెలిసికూడా కొంతమంది గుడ్డిగా ఇతరులనీ తప్పు దోవ పట్టించడానికి, ప్రజలని వెర్రివాళ్ళనుచేయడానికీ పనిలేని, పనిచేతగాని వెధవలు ఈమధ్య ఫేస్ బుక్ వాట్సప్ లలో పనికిరానీ చెత్త పోస్టులు పెట్టి అమాయక ప్రజలను అయోమయానికి గురిచేసి వెర్రిగొర్రెలగా మార్చుతున్నారు.
కావాలని దురుద్దేశముతో పోస్టులు పెట్టేవారిని మార్చలేకపోవచ్చు
కానీ అమాయకత్వముతో గుడ్డిగా పోస్టులు చేసేటప్పుడు ఆపోస్టు ఆసక్తికరంగా వుందనిమాత్రమేకాకుండా మీకు కచ్చితంగా అందులోని విషయం నిజమనితెలిస్తేనే షేర్ చేయండి.
పనికి రానీ ఆరోగ్య చిట్కాలు గుడ్దిగా షేర్ చేసి ఇతరుల ఆరోగ్యం తో ఆటలు ఆడుకోవద్దు, మీరు వుపయోగించి, ప్రయోగించి పనిచేస్తే అప్పుడు షేర్ చేయండి.
కొంతమంది వెధవలు : "వెంటనే షేర్ చేయండీ", 5 సెకన్లలో షేర్ లైక్ చేయండీ "టైప్ హామెన్ టైప్ జీహాద్"
, ఈ మేసేజ్ షేర్ చెస్తే మంచి లెకుంటే చెడు జరుగుద్ది అని జనాలని పిచ్చి గొర్రెలను చేస్తున్నారు. దేవుడెక్కడైనా ఫేస్ బుక్ వాట్సాప్ లో తన ఫొటోలకి లైకులుఎవ్వరు కొడుతున్నారు తనఫోటో ఎన్ని గ్రూపులలో షేర్ చేస్తున్నారు అని లెక్కపెడుతూ కూర్చోడు. వీలైతే ఆకలితో వున్నవాడికి అన్నము పెట్టు లేదా కష్టాలలో వున్న సాటి ప్రాణికి సాయము చేయండి.
ఇంకొంతమంది రోగుల ఫోటో పెట్టి షేర్ చేస్తే వాట్సాప్, ఫేస్ బుక్ వాళ్ళు డబ్బులు ఇస్తారు అని పిచ్చి మెసేజ్ ఒకటి షేర్ చేసి పిచ్చి జనాలు వాటిని షేర్ చేస్తే లైకులు కొడితే వాటినిచూసి దేశము లోఇంతమంది వెర్రిబాగులవాళ్ళు వున్నారా అనినవ్వుకుంటారు.
ఈ మధ్యకాలంలో వంద పోస్టులకుగానూ 90 పోస్టులు చత్తవేగాక ప్రజలను తప్పు దారి పట్టించేవిగా వున్నాయి.
గత కొన్ని సంవత్సరాలలో టీవీ , న్యూస్ పేపర్లలో కూడా నిజమైన ప్రజలను చైతన్యపరచే వార్తలు రావడములేదు వాళ్ళు కూడా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి టీఆర్పి రేటింగ్ కోసమూ, కులగజ్జితో రాజకీయ పార్టీల ఎంగిలి మెతుకులకోసమూ, అశ్లీల కార్యక్రమాలను ప్రసారం చేసుకుంటున్నారు.
ఫేస్ బుక్, వాట్సాప్ లలో సగము మంది సెల్ఫీలు పోస్టుచేయడానికే వాడుతున్నారు 5 శాతం మందిమాత్రమే ప్రజలను చైతన్యపరచడానికి ఉపయోగిస్తున్నారు మిగిలినవారిలో చాలా దొంగ ఎకవుంట్లే.
ఇక చత్త పోస్టులు పెట్టే అవసరం ఎవరికి ఉంది ?
మతచాందసవాదులు
కులగజ్జి గలవారు
రాజకీయ పార్టీల వారు
అభిమానసంగాల వారు
వీళ్లంతా వారి వునికిని కాపాడుకోవడా వారి ప్రత్యర్దుల ధూషించడానికీ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోస్టులు పెడుతుంటారు ప్రజలు పిచ్చి వారిలా అవి షేర్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెట్టుకుంటూ తమ మనసూ ఆరోగ్యమూ ఇతరుల పని పాడుచేస్తూఉంటారు.
ఇప్పటికైనా విగ్నతతో మెలగండి