13/12/2017
టీఆర్టీ దరఖాస్తుకు తుది గడువు 30
* పొడిగించిన టీఎస్పీఎస్సీ
* 10 జిల్లాల ప్రాతిపదిక ప్రకటన జారీ
* రెండోసారి దరఖాస్తులు అవసరం లేదు
* 15 నుంచి 26 వరకు జిల్లాలు మార్చుకునే వెసులుబాటు
ఈనాడు, హైదరాబాద్ : టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు(టీఆర్టీ)కు దరఖాస్తు చేసుకోవడానికి గడువును టీఎస్పీఎస్సీ డిసెంబరు 30వ తేదీ వరకు పొడిగించింది. గతంలో 31 జిల్లాల వారీగా ప్రకటన జారీ చేయడం...10 జిల్లాల వారీగానే భర్తీ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 జిల్లాల వారీగా ప్రకటన ఇవ్వాలని సోమవారం (డిసెంబరు 11) విద్యాశాఖ జీఓ జారీ చేసిన మరుసటి రోజే టీఎస్పీఎస్సీ ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది