08/03/2022
భారత దేశం లో స్త్రీకి మొదట నుండి అత్యధిక ప్రాధాన్యం, గుర్తింపు, గౌరవం ఇస్తూ వచ్చింది. స్త్రీ ని ఆది శక్తి గా ఆది పరా శక్తిగా పూజించిన గొప్ప దేశం మన భారత దేశం...
అదే విధంగా స్త్రీ నీ మనం వివిధ రూపాలలో పూజిస్తూ పూర్వ కాలం నుంచి వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ వస్తుంది మన దేశం....
చదువును సరస్వతి దేవి అని,
డబ్బును లక్ష్మి దేవి అని,
భూమి నీ భూ మాత, భూ దేవి అని,
అదేవిధంగా మన నదుల పేర్లు కూడా గంగా,యమున,సరస్వతి, కావేరి అని స్త్రీ పేరు పేట్టి మహిళలను గౌరవించుకున్నాం. అంతే కాదు ఏ దేశం కూడా మన దేశం లాగా అమెరికా మాతా అని, జపాన్ మాతా అని, రష్యా మాతా అని, సింగపూర్ మాతా అని చివరికి మనతో అన్నింట్లో పోటి పడుతున్నా చైనా కూడా చైనా మాతా అని పేరు పెట్టుకోలేదు. కేవలం ఒక్క మన భారత దేశం మాత్రమే భారత్ మాతా అని పిలుచుకుంటుంది అంటే స్త్రీకి మనదేశం ఇచ్చే గౌరవం ఏంటో అర్థమవుతుంది. అలాంటి భారత దేశం లో మహిళలు ఈ తరం లోనే వంటింటి నుండి అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నారు....
కానీ ప్రస్తుత సమాజం లో కొందరు చేస్తున్న వికృత చేష్టలకు మహిళలు మళ్లీ వంట గదులకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు. అలా జరగకూడదు అంటే ప్రతి ఒక్క మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అప్పుడే భారత దేశం ప్రపంచ దేశాలలో మన దేశ గొప్పతనాన్ని విస్తరించగలం....
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేయాలని నా చిన్న ప్రయత్నం....
మళ్లీ ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు....