Udayagiri TDP

Udayagiri TDP ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. Team

Udayagiri_TDP
Nellore

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకాల అంబాసిడర్! అమరావతి: మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఉ...
31/10/2025

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకాల అంబాసిడర్!
అమరావతి: మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఉపయోగించిన పాత '393' అంబాసిడర్ కారు మళ్లీ వార్తల్లో నిలిచింది!

పార్టీ కార్యాలయంలో ఈ కారును పరిశీలించిన సీఎం, దానితో ఉన్న తన అనుబంధాన్ని, పర్యటనల స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా విస్తృతంగా పర్యటించినప్పుడు ఈ 393 నెంబర్ అంబాసిడర్ కారు సీబీఎన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

ఇకపై ఈ కారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అపురూపంగా ఉంచబడుతుంది. ముఖ్యమంత్రి తన సొంత వాహనమైన పాత అంబాసిడర్‌ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది!

..

వరద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కాకర్ల..!🔸 కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు దుప్పట్ల పంపిణీ చేసిన ఎమ్...
30/10/2025

వరద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కాకర్ల..!

🔸 కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు దుప్పట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!

కొండాపురం అక్టోబర్ 29న

మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న నిరంతర భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు, కాలనీలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, తమ సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు.

ఎమ్మెల్యే గారు కొండాపురం మండలం పరిధిలోని సాయి పేట పంచాయతీలోని సాయి పేట ఎస్సీ కాలనీ, కొమ్ముపాలెం, ఇస్కపాలెం వంటి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, తక్షణ ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఓరుగంటి సుమన్ మరియు దామా శివ బాబు సమన్వయంతో, వరద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు దుప్పట్లు మరియు అవసరమైన సహాయక వస్తువులను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు స్వయంగా పంపిణీ చేశారు.

ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే “ప్రజల కష్టాలు మా కష్టాలే. ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందించేందుకు నేను వ్యక్తిగతంగా కృషి చేస్తాను. ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం చేరేలా చూసుకుంటాను,”అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు విస్తృతంగా పాల్గొన్నారు.

28/10/2025

తేది.28.10.2025 న కలిగిరి. 🔸తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.🔸మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో – దుప్పట్లు పం...
28/10/2025

తేది.28.10.2025 న
కలిగిరి.

🔸తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

🔸మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో – దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

🔸ప్రజల కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం.

కలిగిరి అక్టోబర్ 28న

గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షాలు, నిన్న రాత్రి నుండి మొంథా తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలు ప్రజల జీవితాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండటంతో పాటు వాతావరణంలో చలి తీవ్రంగా పెరగడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రజల పట్ల తమ హృదయపూర్వకమైన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.

ప్రజల బాధను అర్థం చేసుకొని, స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గారు కలిగిరి మండల కేంద్రంలోని టుబాకో బోర్డు ఎస్టీ కాలనీలోని సుమారు 100 కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు, తినుబండారాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – “ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం నా బాధ్యత. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా అవసరమైన సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలందరూ తుఫాను నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సహాయం కొరకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి ఈ సేవా తపనను, మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ – “ప్రతి సందర్భంలో ప్రజల పక్కన నిలబడి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నిజమైన ప్రజానాయకుడు” అని అభిప్రాయపడ్డారు.

22-10-25 వింజమూరుశ్రీవారి నిధుల తో గుండె మడగల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి ఘనంగా భూమి పూజ..!విశిష్ట అతిథు...
22/10/2025

22-10-25 వింజమూరు

శ్రీవారి నిధుల తో గుండె మడగల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి ఘనంగా భూమి పూజ..!

విశిష్ట అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..;!

వర్షాన్ని సైతం లెక్కచేయక భూమి పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు భక్తులు..!

వింజమూరు అక్టోబర్ 22

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవారి కోటి రూపాయల నిధులతో శ్రీ సీతా రామాంజనేయ ఆలయానికి భక్తుల జయజయ ద్వానాలు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. విశిష్ట అతిధులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, పూజించిన ఇటుకలను అందజేశారు. వేద పండితుల వద్ద ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం శ్రీ సీతారామాంజనేయ స్వామి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి గుండె మడగల గ్రామస్తులు , స్థానిక ప్రజా ప్రతినిధులు అపూర్వ స్వాగతంపలికారు. పెద్ద ఎత్తున బాణా సంచాలు కాల్చుతూ పూలను వెదజల్లారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కోటి రూపాయలు నిధులను మా నియోజకవర్గంలోని గుండెమడుగుల గ్రామానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి, అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండె మడకల గ్రామంలోశ్రీసీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని ఈ గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు.

అందరికీ నమస్కారం🙏తేది.22.10.2025, బుధవారం ఉదయం 10 గంటలకు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామ స్వాముల వారి దేవ...
21/10/2025

అందరికీ నమస్కారం🙏

తేది.22.10.2025, బుధవారం ఉదయం 10 గంటలకు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామ స్వాముల వారి దేవస్థానo శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు మరియు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 1:00 గంటకు,
నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారిని గౌరవ దేవాదాయ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు దర్శించుకుంటారు.

కావున తెలుగుదేశం-జనసేన-బిజెపి నాయకులు, కార్యకర్తలు, కూటమి కుటుంబ సభ్యులందరూ పాల్గొని, ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా తెలియజేయడమైనది.

ఇట్లు,
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి క్యాంప్ కార్యాలయం,
ఉదయగిరి నియోజకవర్గం.

ప్రజాసేవలో 15 ఏళ్ల మైలురాయి.!!ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశ చూపిన దూరదృష్టి నాయకుడు శ్రీ Nara Chandrababu Naidu గారు...
11/10/2025

ప్రజాసేవలో 15 ఏళ్ల మైలురాయి.!!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశ చూపిన దూరదృష్టి నాయకుడు శ్రీ Nara Chandrababu Naidu గారు సాంకేతికతతో పాలనకు రూపం ఇచ్చి, ప్రతి రంగంలో ఆధునిక ఆంధ్ర ప్రగతికి పునాది వేసిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు.!!

తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్లనైనా ఉపేక్షించని తత్వం చంద్రబాబుది. తప్పుడు అడుగులు వేస్తూ, తప్పు చేసేవారి పక్షాన నిలబడే త...
06/10/2025

తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్లనైనా ఉపేక్షించని తత్వం చంద్రబాబుది. తప్పుడు అడుగులు వేస్తూ, తప్పు చేసేవారి పక్షాన నిలబడే తత్వం జగన్‌ది.




మెడికల్ కాలేజీలను తానేదో ఉద్ధరించేసినట్టు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ వస్తాడంట.అసలు ఆ కాలేజీ పేరెత్తే అర్హత...
06/10/2025

మెడికల్ కాలేజీలను తానేదో ఉద్ధరించేసినట్టు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ వస్తాడంట.అసలు ఆ కాలేజీ పేరెత్తే అర్హత జగన్‌కు ఉందా?
PPP మూలంగా ఆ కాలేజీలో పేద విద్యార్థుల ఫ్రీ సీట్లు 11 పెరిగి 64 నుంచి 75కి చేరుతాయన్న విషయం జగన్‌కు తెలుసా?



జగన్ పాలన అనగానే దళిత డాక్టర్ సుధాకర్ నుంచి శవంగా మారి డోర్ డెలివరీ కాబడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వైసీపీ నేతల కుల అహం...
06/10/2025

జగన్ పాలన అనగానే దళిత డాక్టర్ సుధాకర్ నుంచి శవంగా మారి డోర్ డెలివరీ కాబడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వైసీపీ నేతల కుల అహంకారం మూలంగా బలైన దళితులే గుర్తొస్తారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన రాజకీయ మనుగడ కోసం చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించాడు.

Address

Bhyravaram
Duttaluru
524228

Website

https://www.youtube.com/@KakarlasureshTeam

Alerts

Be the first to know and let us send you an email when Udayagiri TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share